guntur: గుంటూరులో సంచలనం... కారుతో ఢీకొట్టి, 30 సెకన్లలో 30 సార్లు నరికి.. రౌడీ షీటర్ దారుణ హత్య... సీసీటీవీ ఫుటేజ్ చూడండి!

  • బిజీ రోడ్డులో దారుణ హత్య
  • రౌడీషీటర్ బసవల వాసును వాహనంతో ఢీకొట్టించిన దుండగులు
  • ఆపై విచక్షణారహితంగా దాడి
  • పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందన్న పోలీసులు

గుంటూరులో నిత్యమూ బిజీగా ఉండే అరండల్ పేటలో పోలీసు స్టేషన్ కు అత్యంత సమీపంలో దారుణం జరిగింది. ఓ రెస్టారెంటులో భోజనం చేసి వస్తున్న రౌడీ షీటర్ బసవల భారతి వాసు (39)ను నలుగురు దుండగులు వాహనంతో ఢీకొట్టి, ఆపై కత్తులతో విరుచుకుపడి హత్య చేశారు. విద్యానగర్ నాలుగో లైన్ లో నివాసం ఉండే వాసు, మరికొందరితో కలసి అరండల్ పేట 12వ లైన్ లోని ఓ బిర్యానీ పాయింట్ కు వెళ్లి, డిన్నర్ ముగించుకుని వస్తున్న సమయంలో రాత్రి 8.26కు ఈ ఘటన జరిగింది.

తెలుగు విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాకిరి నాగ చైతన్యతో కలసి బయటకు వచ్చిన వాసును, 'ఏపీ 16 ఏఈ 9199' స్కార్పియోలో వచ్చిన దుండగులు ఢీకొట్టారు. ఆపై 30 సెకన్ల వ్యవధిలో 30 సార్లు నరికి, చనిపోయాడో, లేదో చూసుకుని, గొంతు కోసి, ఆ తర్వాత వచ్చిన వాహనంలోనే పారిపోయారు. ఈ హత్య పథకం ప్రకారం జరిగి ఉంటుందని, అనుమానిత నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. గుంటూరు మాజీ ఎమ్మెల్యేకు దగ్గరి సన్నిహితుడైన వాసు, ఇటీవలే ఓ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉంటూ బెయిలుపై బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.<blockquote class="twitter-video" data-lang="en"><p lang="en" dir="ltr">Brutal Murder caught on cam in Guntur. Deceased identified as Vasu, a rowdy sheeter, hacked to death. Stabbed over 30 times <a href="https://twitter.com/hashtag/AndhraPradesh?src=hash&ref_src=twsrc%5Etfw">#AndhraPradesh</a> <a href="https://t.co/f2HttJuvlP">pic.twitter.com/f2HttJuvlP</a></p>— Aashish (@Ashi_IndiaToday) <a href="https://twitter.com/Ashi_IndiaToday/status/924693202677899265?ref_src=twsrc%5Etfw">October 29, 2017</a></blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>


  • Loading...

More Telugu News