Pakistan: ఎనిమిదేళ్ల తరువాత పాక్ గడ్డపై కాలుపెట్టిన లంక క్రికెటర్లు... కనీవినీ ఎరుగని భద్రత!

  • లాహోర్ చేరుకున్న శ్రీలంక క్రికెట్ టీమ్
  • వందల మంది సైనికులతో భారీ భద్రత
  • బాంబ్ ప్రూఫ్ బస్ లో స్టార్ హోటల్ కు ఆటగాళ్లు

లాహోర్ లో లంక క్రికెటర్లపై ఉగ్రవాదుల దాడి జరిగిన ఎనిమిది సంవత్సరాల తరువాత తిరిగి అదే గడ్డపై అడుగుపెట్టింది లంక టీమ్. మూడవ టీ-20 పోరుకోసం వచ్చిన లంక క్రికెటర్ల భద్రత కోసం పాక్ ప్రభుత్వం కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేసింది. ఎయిర్ పోర్టులో వారు దిగినప్పటి నుంచి ఫైవ్ స్టార్ హోటల్ కు తీసుకువెళ్లి దించేంత వరకూ మార్గమధ్యంలో ప్రజలెవరినీ తిరగనీయలేదు.

బాంబ్ ప్రూఫ్ బస్సును ఏర్పాటు చేసిన పాక్ సర్కారు, వందల మంది సైనికులతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. 2009లో ఇదే మార్గంలో ప్రయాణిస్తున్న లంక జట్టు బస్సుపై దుండగులు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. కాగా, తాజా పర్యటనలో భాగంగా లంక జట్టు మధ్యస్థ వేదికైన దుబాయ్ లో పాకిస్థాన్ తో కలసి మ్యాచ్ లు ఆడింది. చివరి టీ-20 మ్యాచ్ ని లాహోర్ లో ఆడి, ఆపై జట్టు కొలంబోకు చేరనుంది.

More Telugu News