sandeepkishan: కృష్ణవంశీ ఆ మాట అన్నారు .. అంతకంటే ఏం కావాలి?: సందీప్ కిషన్

  • 'నక్షత్రం' సక్సెస్ కాలేదన్న బాధలేదు 
  • నాపై కృష్ణవంశీకి గల నమ్మకానికి ఆశ్చర్యం వేసింది 
  • ఆయన దర్శకత్వంలో చేయాలనే కోరిక నెరవేరింది 
  • ఆయనపై గౌరవం ఎప్పటికీ తగ్గదు      

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'నక్షత్రం' మూవీ భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇందులో హీరోగా చేసిన సందీప్ కిషన్ తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి ప్రస్తావించాడు. " కృష్ణవంశీ మార్క్ చిత్రంగా 'నక్షత్రం' మంచి వసూళ్లు రాబడుతుందని అంతా ఆశించాం. కానీ అలా జరగకపోవడం అందరినీ నిరాశ పరిచింది.

 ఈ సినిమాకి ముందు నేను చేసిన 'ఒక్క అమ్మాయి తప్ప' ప్లాప్ అయింది. దాంతో 'నక్షత్రం' సినిమాకి నన్ను హీరోగా తీసుకోవడం పట్ల నిర్మాతలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తారేమోనని అన్నాను. "అవసరమైతే వేరే నిర్మాతలతో చేస్తాను గానీ .. నిన్ను మాత్రం మార్చను" అని కృష్ణవంశీ అన్నారు. నాపై ఆయనకి గల నమ్మకానికి ఆశ్చర్యం వేసింది .. ఆయన ఆ మాటన్న తరువాత అంతకన్నా ఏం కావాలి? అనిపించింది. 'నక్షత్రం' సినిమా పరాజయం పాలైనా కృష్ణవంశీ గారి పట్ల నాకు గల గౌరవం ఎప్పటికీ తగ్గదు. ఆయన దర్శకత్వంలో చేయాలనే కోరిక నెరవేరినందుకు ఆనందంగా వుంది" అని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News