Pawan Kalyan: అన్ని జిల్లాల్లోను జ‌న‌సేన‌ కార్యాల‌యాల ఏర్పాటుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క‌ నిర్ణ‌యాలు

  • హైద‌రాబాద్, అమ‌రావ‌తిలో 5 ఎక‌రాల విస్తీర్ణంలో పార్టీ కార్యాల‌యాలు
  • వీలైనంత త్వ‌ర‌గా కార్యాల‌యాలు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం
  • పార్టీలోని కొంత మందికి జన‌సేన కార్యాల‌యాల నిర్మాణ‌ బాధ్య‌త‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో త‌మ పార్టీ కార్యాల‌యాలు ఏర్పాటు చేయాల‌ని సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క‌ నిర్ణ‌యాలు తీసుకున్నారు. హైద‌రాబాద్, అమ‌రావ‌తిలో 5 ఎక‌రాల విస్తీర్ణంలో పార్టీ కార్యాల‌యాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే మిగ‌తా జిల్లా కేంద్రాల్లో రెండెక‌రాల విస్తీర్ణంలో జ‌న‌సేన కార్యాల‌యాలు నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం పార్టీ స‌భ్య‌త్వాల‌పై దృష్టిపెట్టిన ప‌వ‌న్ జ‌న‌సేన కార్యాల‌యాల‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని యోచిస్తున్నారు.

తెలంగాణ‌లో తొలిద‌శ‌లో ఉమ్మ‌డి జిల్లాల కేంద్రాల్లోనే కార్యాల‌యాలు ఏర్పాటు చేయ‌నున్నారు. రెండో ద‌శ‌లో కొత్త‌గా ఏర్పడిన అన్ని జిల్లాల్లోనూ జ‌న‌సేన కార్యాల‌యాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి పార్టీలోని కొంత మందికి బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు. 

  • Loading...

More Telugu News