Chandrababu: ఈ క‌ట్ట‌డాల‌ను చూస్తే నా అసెంబ్లీ నా జ‌న్మ‌భూమి అన్న భావ‌న రావాలి: చ‌ంద్ర‌బాబు

  • ప‌లు ఆకృతుల‌ను ప‌రిశీలించాం
  • అసెంబ్లీ ఆకృతి , 45 రోజుల్లో ఖ‌రారు
  • గ‌తంలో ఐటీ మీద ఎక్కువ‌గా దృష్టి పెట్టేవాడిని
  • ఈ సారి వ్య‌వ‌సాయ సాంకేతిక‌త‌కు ప్రాధాన్య‌త

ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను పరిష్కరించే వేదిక‌, భ‌విష్య‌త్తులో ఎటువంటి స‌మ‌స్య‌లు రాకుండా చర్చలు చేసే వేదిక అసెంబ్లీ అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ రోజు అమ‌రావ‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ప్ర‌పంచంలో తెలుగువారు ఎక్క‌డున్నా వారంతా గ‌ర్వ‌ప‌డేలా అమ‌రావ‌తిలో అసెంబ్లీ భ‌వ‌నాన్ని నిర్మిస్తామ‌ని తెలిపారు. ప్ర‌పంచంలో మ‌న‌వాళ్లు ఎక్క‌డున్నా ఈ క‌ట్ట‌డాల‌ను చూస్తే, నా అసెంబ్లీ నా జ‌న్మ‌భూమి అన్న భావ‌న వారిలో రావాలని చ‌ంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

చ‌ట్టాలు చేసే వేదిక అద్భుతంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉందని అన్నారు. ప‌లు ఆకృతుల‌ను ప‌రిశీలించామ‌ని, 45 రోజుల్లో ఆకృతులను ఖ‌రారు చేస్తామ‌ని తెలిపారు. గ‌తంలో తాను ఐటీ మీద ఎక్కువ‌గా దృష్టి పెట్టేవాడిన‌ని, అయితే ఈసారి వ్య‌వ‌సాయ సాంకేతిక‌త‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నాన‌ని చెప్పారు.   

More Telugu News