sri chitanya: మంత్రి నారాయణ మమ్మల్ని వేధిస్తున్నారు: చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మ ఆరోపణలు

  • 'చైనా' సంస్థలుగా పేరుగాంచిన శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలు
  • చైనా సంస్థల మధ్య విభేదాలు
  • పరస్పర విమర్శలు చేసుకుంటున్న సంస్థలు

మంత్రి నారాయణపై చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మ చౌదరి సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థల మధ్య సుదీర్ఘకాలంగా వృత్తిపరమైన పోటీ ఉన్న సంగతి తెలిసిందే. నారాయణ మంత్రి కాకముందు ఈ రెండు సంస్థలు మెర్జ్ అయిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలను కలిపి 'చైనా' (చైతన్య, నారాయణ) సంస్థలుగా పిలిచేవారు. తాజాగా నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి.

ఈ క్రమంలో చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మ మంత్రి నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ చైతన్య విద్యాసంస్థలను వేధిస్తున్నారని ఆరోపించారు. చైతన్య విద్యాసంస్థలను దెబ్బతీసేందుకు గత కొంతకాలంగా ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా నారాయణ విద్యాసంస్థలతో కలిసి పని చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో ఎన్నో అవమానాలు భరించామని ఆమె చెప్పారు. ఇంకెన్నో మోసాలను కూడా చూశామని ఆమె వెల్లడించారు. తమ ఓపిక నశించిందని, ఇకపై నారాయణ విద్యాసంస్థలతో కలిసి ప్రయాణం చేయడం కష్టమనే అభిప్రాయానికి వచ్చామని ఆమె తెలిపారు.

తమ ర్యాంకులను నారాయణ ర్యాంకులుగా చెప్పుకుంటోందని, తమ వద్ద చేరిన విద్యార్థులను తమ విద్యార్థులంటారని, తాజాగా నారాయణ సొంత జిల్లాలో తమ విద్యా సంస్థ డైరెక్టర్లపై కేసులు పెట్టి అరెస్టు చేయించారని, తమ సంస్థలో చేరిన ముగ్గురు హైదరాబాదు బాలురను నారాయణ సంస్థలో జాయిన్ చేయిస్తేనే వారిని విడుదల చేస్తామంటున్నారని ఆమె మండిపడ్డారు. ఆ విద్యార్థులను వారి తల్లిదండ్రులే తమ సంస్థలో జాయిన్ చేశారని, దానికి సాక్ష్యం కూడా ఉందని ఆమె తెలిపారు. 

  • Loading...

More Telugu News