Pakistan: భారత స్పై డ్రోన్ ను కూల్చేశామని ప్రకటించిన పాకిస్థాన్!

  • ఎల్ఓసీ వద్ద భారత స్పై డ్రోన్ ను కూల్చేసిన పాక్ సైన్యం
  • విషయం వెల్లడించిన పాక్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్
  • ట్విట్టర్ లో ఫొటో పోస్టు చేసిన గఫూర్

లైన్ ఆఫ్ కంట్రోల్ (నియంత్రణ రేఖ) వెంబడి భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో తిరుగుతున్న భారత స్పై డ్రోన్‌ ను కూల్చేశామని పాక్‌ సైన్యం ప్రకటించింది. ఈ మేరకు పాక్ మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్విట్టర్ ఖాతాలో ఒక ఫొటో పోస్టు చేశారు. పాకిస్థాన్ లోని రఖ్చిక్రి సెక్టార్‌ లో ఈ డ్రోన్‌ కనిపించిందని తెలిపారు. దానిని తమ సైనికులు కూల్చివేసి, నాశనం చేశారని ఆయన ట్వీట్ చేశారు.  

More Telugu News