Chandrababu: రాజ‌ధాని ఆకృతులు దాదాపు ఖ‌రారు... రాజ‌మౌళి కీలకంగా వ్య‌వ‌హ‌రించారు!: చ‌ంద్ర‌బాబు

  • విదేశీ ప‌ర్య‌ట‌న త‌రువాత మీడియాతో మాట్లాడిన చంద్ర‌బాబు
  • అసెంబ్లీ మిన‌హా రాజ‌ధాని భ‌వనాల ఆకృతులు ఖ‌రారు
  •  సంక్రాంతికి రాజ‌ధానిలో శాశ్వ‌త భ‌వ‌నాల నిర్మాణ ప‌నులు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం 

విదేశీ ప‌ర్య‌ట‌న నుంచి తిరిగి వ‌చ్చిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ మిన‌హా రాజ‌ధాని భ‌వనాల ఆకృతులు ఖ‌రారు అయ్యాయ‌ని తెలిపారు. సంక్రాంతికి రాజ‌ధానిలో శాశ్వ‌త భ‌వ‌నాల నిర్మాణ ప‌నులు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.

సినీ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మంచి సూచ‌న‌లు చేశార‌ని, ఈ విషయంలో ఆయన కీలకంగా వ్య‌వ‌హ‌రించారని చ‌ంద్ర‌బాబు ప్ర‌శంసించారు. మ‌రో 40 రోజుల్లో అసెంబ్లీ ఆకృతులను పూర్తిగా ఖ‌రారు చేస్తామ‌ని చెప్పారు. పోల‌వ‌రం నిర్మాణానికి నిధుల‌ ఇబ్బంది ఉందని, త్వ‌ర‌లోనే ఆ అడ్డంకులు తొల‌గిపోతాయని ముఖ్యమంత్రి అన్నారు. 

More Telugu News