sumanth: క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సుమంత్ కొత్త చిత్రం ప్రారంభం

  • హిట్ కోసం సుమంత్ ప్రయత్నాలు 
  • అనిల్ శ్రీకంఠంతో సెట్స్ పైకి 
  • కథానాయికగా అంజు కురియన్ 
  • వచ్చేనెల 1 నుంచి రెగ్యులర్ షూటింగ్

కథానాయకుడిగా సుమంత్ ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయినా, ఆశించిన స్థాయిలో ఆయనకి హిట్స్ పడలేదు. అయినా ఆయన ఎంత మాత్రం నిరాశ చెందకుండా, వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. అలా ఈ రోజున ఆయన కొత్త చిత్రం లాంచ్ అయింది.

హైదరాబాద్ - ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. సాంబశివా రెడ్డి .. శ్రీధర్ నిర్మాణంలో అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ సినిమాలో సుమంత్ సరసన కథానాయికగా అంజు కురియన్ ను తీసుకున్నారు. వచ్చేనెల 1వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. హైదరాబాద్ .. వైజాగ్ .. అరకు తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరపనున్నారు.

  • Loading...

More Telugu News