vamsi paidipalli: మహేశ్ 25వ సినిమాకి ఇంకా టైటిల్ అనుకోలేదు: వంశీ పైడిపల్లి

  • మహేశ్ 25వ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి 
  • దర్శకుడిగా వంశీ పైడిపల్లి 
  • నిర్మాతలుగా దిల్ రాజు - అశ్వనీదత్

ప్రస్తుతం మహేశ్ బాబు .. కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు తరువాత తన 25వ సినిమాను వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. సంఖ్యా పరంగా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకుంది. దిల్ రాజు - అశ్వనీదత్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి విదేశాల్లో లొకేషన్స్ వేటలో వున్నాడు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం 'హరేరామ హరే కృష్ణ' .. 'కృష్ణా ముకుందా మురారి' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ రెండింటిలో 'కృష్ణా ముకుందా మురారి' టైటిల్ ను ఓకే చేయవచ్చని చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై స్పందించిన వంశీ పైడిపల్లి, ఈ సినిమా కోసం ఇంకా ఏ టైటిల్ అనుకోలేదనీ .. ఫిక్స్ చేసుకుంటే వెంటనే తెలియజేస్తామని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశాడు.  

More Telugu News