Accident: విజ‌య‌వాడ‌లో బ‌స్సు బీభ‌త్సం.. ఇద్ద‌రి మృతి.. న‌లుగురికి తీవ్ర‌గాయాలు

  • బుడ‌మేరు వంతెన వ‌ద్ద వాహ‌న‌దారుల‌పైకి దూసుకెళ్లిన‌ ఆర్టీసీ బ‌స్సు
  • బ‌స్సు బ్రేకులు విఫ‌లం కావ‌డమే కార‌ణం
  • కృష్ణా జిల్లా ఆర్టీసీ అధికారుల‌తో ఆ సంస్థ‌ ఎండీ మాల‌కొండ‌య్య భేటీ

విజ‌య‌వాడ‌లోని బుడ‌మేరు వంతెన వ‌ద్ద‌ ఓ ఆర్టీసీ బ‌స్సు బీభ‌త్సం సృష్టించింది. రోడ్డుపై వెళుతున్న ఆర్టీసీ మెట్రో బ‌స్సు బ్రేకులు విఫ‌లం కావ‌డంతో వాహ‌న‌దారుల‌పైకి దూసుకువెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా మ‌రో న‌లుగురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమ‌య్యాయి.

ఆర్టీసీ బ‌స్సు బ్రేకులు విఫ‌లం అయిన విష‌యాన్ని అధికారులు తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నారు. కృష్ణా జిల్లా ఆర్టీసీ అధికారుల‌తో ఆ సంస్థ‌ ఎండీ మాల‌కొండ‌య్య స‌మావేశ‌మ‌య్యారు. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన వారిని పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు.  

More Telugu News