maheshbabu: సీఎం క్యాంప్ ఆఫీస్ సెట్లో మహేశ్ షూటింగ్!

  • మహేశ్ తాజా చిత్రంగా 'భరత్ అను నేను'
  • హైదరాబాద్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ 
  • వచ్చేనెల 22 నుంచి ఔట్ డోర్ షెడ్యూల్ 
  • ఏప్రిల్ 27వ తేదీన భారీ రిలీజ్    

కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక్కడ ప్రత్యేకంగా వేసిన సీఎం క్యాంప్ ఆఫీస్ సెట్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ షూటింగ్ వచ్చేనెల 7వ తేదీ వరకూ జరుగుతుందని నిర్మాత డీవీవీ దానయ్య అన్నారు.

ఆ తరువాత నవంబర్ 22 నుంచి ఔట్ డోర్ షూటింగ్ ఉంటుందని చెప్పారు. ఈ షెడ్యూల్ షూటింగ్ నాన్ స్టాప్ గా కొనసాగుతుందని అన్నారు. కొరటాలతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందనీ, తమ బ్యానర్లో ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని చెప్పారు. మహేశ్ కెరియర్లో ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, వచ్చే ఏడాది ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నారు.   

More Telugu News