padmavati: `పద్మావతి` సినిమాను త్రీడీలో విడుదల చేసే అవకాశం!

  • ట్రైల‌ర్‌, మొద‌టి పాట‌కు వ‌చ్చిన స్పంద‌న‌తో నిర్ణ‌యం
  • స‌మ్మ‌తించిన సంజ‌య్ లీలా భ‌న్సాలీ
  • 90 దేశాల్లో విడుద‌ల చేయ‌నున్న పారామౌంట్ పిక్చ‌ర్స్‌

దీపికా ప‌దుకునే, ర‌ణ్‌వీర్ సింగ్‌, షాహిద్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్రతిష్ఠాత్మ‌కంగా నిర్మించిన `ప‌ద్మావ‌తి` చిత్రాన్ని త్రీడీలోనూ విడుద‌ల చేసేందుకు చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే విడుద‌లైన చిత్ర ట్రైల‌ర్‌, మొద‌టి పాట‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న రావ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంజ‌య్ లీలా భ‌న్సాలీ కూడా స‌మ్మ‌తించిన‌ట్లు చెబుతున్నారు.

భ‌న్సాలీ చిత్రాల్లో ఉండే భారీ సెట్టింగులు, యుద్ధ స‌న్నివేశాలు, వ‌స్త్రాలంక‌ర‌ణ‌ల‌ను త్రీడీలో చూపించ‌డం వ‌ల్ల ప్రేక్ష‌కుల‌ను మ‌రింత క‌ట్టిప‌డేసే అవ‌కాశం ఉంది. ఈ నిర్ణ‌యానికి సినిమా అంత‌ర్జాతీయ డిస్ట్రిబ్యూట‌ర్ పారామౌంట్ పిక్చ‌ర్స్ కూడా మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది. దాదాపు 90కి పైగా దేశాల్లో ఈ చిత్రాన్ని పారామౌంట్ పిక్చ‌ర్స్ వారు విడుద‌ల చేయ‌బోతున్నారు. నిన్న విడుద‌లైన `ఘూమ‌ర్‌` పాట‌ను ఇప్ప‌టికే 10 ల‌క్ష‌ల‌ మందికి పైగా వీక్షించారు. సినిమా నిర్మాణ విలువ‌ల గొప్ప‌ద‌నం ఈ ఒక్క పాట‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంద‌ని వీక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

More Telugu News