brahmaji: 'సిందూరం' ఫ్లాప్ మమ్మల్ని చాలా బాధపెట్టింది : బ్రహ్మాజీ

  • కేరక్టర్ ఆర్టిస్టుగా బ్రహ్మాజీకి మంచి పేరు 
  • 'సిందూరం'లో కృష్ణవంశీ ఛాన్స్ ఇచ్చారు 
  • అప్పటికే ఆయన హిట్స్ ఇచ్చి వున్నారు 
  • కొత్తవాళ్లతో చేయొద్దని ఆయనకి చెప్పిన వాళ్లున్నారు   

తెలుగు తెరపై వైవిధ్యభరితమైన పాత్రలను పోషించే కేరక్టర్ ఆర్టిస్టులలో బ్రహ్మాజీ ఒకరు. సీరియస్ గా నడిచే పాత్రలతో పాటు కామెడీని కూడా పండించడం ఆయన ప్రత్యేకత. తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కెరియర్ కి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. రవితేజతో పాటు తాను ప్రధానమైన పాత్రను పోషించిన 'సిందూరం' పరాజయం పాలు కావడం గురించి ప్రస్తావించారు.

 " 'సిందూరం' అప్పటికే కృష్ణవంశీ 'గులాబీ' .. 'నిన్నే పెళ్లాడుతా' వంటి హిట్స్ ఇచ్చి వున్నాడు. దాంతో ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కృష్ణవంశీకి ఆఫర్లు ఇచ్చారు. ఎంతైనా తీసుకుని తమకి ఓ సినిమా చేసిపెట్టమనీ .. తమ వారసులను పరిచయం చేయమని ఎంతోమంది ప్రొడ్యూసర్లు అడిగారు. కొత్త వాళ్లతో ఎందుకు రిస్క్ అని కృష్ణవంశీతో కొందరు అన్నారు. అలాంటి సమయంలో ఆయన 'సిందూరం' కోసం నన్ను . . రవితేజను తీసుకున్నారు. నిజానికి అది చాలా మంచి సినిమా .. అయినా ఆడకపోవడంతో నేను .. రవితేజ . . కృష్ణవంశీ చాలా ఫీలయ్యాం" అని చెప్పారు.   

More Telugu News