Talasani Srinivas Yadav: కాంగ్రెస్‌ అనే మహా సముద్రంలో రేవంత్‌ ఎంత?: త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఎద్దేవా

  • ఒక‌రు ఎల్ల‌ప్పుడూ మీడియాలో నిల‌వాల‌ని చూస్తారు
  • మ‌రొక‌రు పైరవీలు చేస్తారు
  • ఇక మూడవ ఎమ్మెల్యే త‌మ‌ పార్టీనే ప‌ట్టించుకోరు

టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి పార్టీ మార‌తారని వ‌స్తోన్న ప్ర‌చారంపై తెలంగాణ‌ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. అసలు తెలంగాణ‌ టీడీపీలో ఎంత మంది ఎమ్మెల్యేలున్నారని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఆ పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటే వారిలో ఒక‌రు ఎల్ల‌ప్పుడూ మీడియాలో నిల‌వాల‌ని చూస్తార‌ని, మ‌రొక‌రు పైరవీలు చేస్తారని, ఇక మూడవ ఎమ్మెల్యే త‌మ‌ పార్టీనే ప‌ట్టించుకోర‌ని అన్నారు. కాంగ్రెస్‌ అనే మహా సముద్రంలో రేవంత్‌ ఎంత? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్ నేత‌ల‌కు ఎలా ముందుకు వెళ్లాలో తెలియ‌ద‌ని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు. అసెంబ్లీలో తాము వారికి మాట్లాడే అవకాశం ఇస్తామన్న‌ప్ప‌టికీ నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ని చెప్పారు. తాము ఏపీ మంత్రి యనమలకు కాంట్రాక్టులు ఎక్కడిచ్చామ‌న్న విష‌యాన్ని విప‌క్ష నేత‌లు ఇప్ప‌టికీ చెప్పలేదని అన్నారు.  

More Telugu News