atlee kumar: తెలుగు హీరోలపై దృష్టిపెట్టిన 'మెర్సల్' డైరెక్టర్!

  • 'మెర్సల్'తో హిట్ అందుకున్న అట్లీకుమార్
  • 'అదిరింది' టైటిల్ తో తెలుగులోకి 
  • నేరుగా తెలుగు సినిమా చేసే ఆలోచన 
  • మహేశ్ .. బన్నీలతో చర్చలు

తమిళ యువ దర్శకులలో అట్లీ కుమార్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. మాస్ ఆడియన్స్ ను మెప్పించే దర్శకుడిగా మంచి గుర్తింపు వుంది. ఆయన తాజా చిత్రం 'మెర్సల్' వసూళ్ల పరంగా దుమ్మురేపేస్తోంది. గతంలో ఆయన సినిమాలు 'రాజు రాణి' .. 'పోలీసోడు' తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించాయి. అదే విధంగా 'మెర్సల్' కూడా 'అదిరింది' పేరుతో ఈ నెల 27న తెలుగులో విడుదల కానుంది.

 ఈ నేపథ్యంలో నేరుగా ఓ తెలుగు సినిమా చేయాలని ఉందని అట్లీ కుమార్ అన్నాడు. తెలుగులో తనకి చిరంజీవి .. పవన్ .. మహేశ్ .. ఎన్టీఆర్ .. బన్నీ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఇప్పటికే మహేశ్ .. బన్నీలతో చర్చలు జరిపానని అన్నాడు. మరి ఆయనతో సినిమా చేయడానికి వీరిలో ఎవరు ముందుకు వస్తారో చూడాలి. ఒక వైపున ఆయన దర్శకత్వంలో చేయడానికి తమిళ హీరోలంతా పోటీ పడుతుంటే, ఆయన తెలుగు హీరోలపై దృష్టి పెట్టడం విశేషమే.         

More Telugu News