ntr: 73 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకున్న 'జై లవకుశ'!

  • సెప్టెంబర్ 21న విడుదలైన 'జై లవ కుశ' 
  • ఎన్టీఆర్ నటనకు 100 మార్కులు 
  • వసూళ్ల పరంగా అంచనాలను అందుకోలేకపోయింది 
  • స్వల్ప నష్టాలతో సరిపెట్టుకుంది  

ఎన్టీఆర్ మూడు విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలతో 'జై లవ కుశ' సినిమా చేశాడు. సెప్టెంబర్ 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ పుష్కలంగా ఉండటంతో, ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. వసూళ్ల పరంగా ఈ సినిమా జోరు చూసిన వాళ్లు .. ఎన్టీఆర్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించినదిగా ఈ సినిమా నిలుస్తుందని భావించారు.

 80 కోట్ల షేర్ ను రాబడితే ఈ సినిమా ఆ స్థాయిని అందుకోవడం ఖాయమనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేశారు. కానీ ఈ సినిమా ఫుల్ రన్ లో 80 కోట్ల షేర్ మార్క్ ను అందుకోలేకపోయింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను 86 కోట్లకు అమ్మారు .. కానీ 73 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది. 13 కోట్ల వరకూ నష్టాలు తెచ్చుకున్న ఈ సినిమా .. వసూళ్ల పరంగా ఎన్టీఆర్ కెరియర్లో 'జనతా గ్యారేజ్' తరువాత స్థానంలోనే నిలిచిందని అంటున్నారు.   

More Telugu News