maharashtra: అధికారులా మజాకా?... వందమంది రైతులకు ఒకే ఆధార్ కార్డు!

  • మహారాష్ట్రలో రైతు రుణమాఫీ 
  • బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ జతచేసుకోవాలన్న అధికారులు
  • ఒకే ఆధార్ నెంబర్ ఉన్న వంద మంది రైతులను గుర్తించిన బ్యాంకు అధికారులు

ఆధార్ కార్డు సిబ్బంది చేసిన పొరపాటు వంద మంది రైతులకు ఇప్పుడు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఒకే ఆధార్ నెంబర్ ను దాదాపు వంద మంది రైతులకు ఇవ్వడంతో మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మహారాష్ట్రలో మొదటి దశ రైతు రుణమాఫీ నేపథ్యంలో బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్యను జత చేసుకోవాలన్న ఆదేశాల నేపథ్యంలో బ్యాంకుకు వెళ్లిన వందమంది రైతులు ఒకే ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వడంతో బ్యాంకు అధికారులు షాక్ తిన్నారు.

దీంతో వారిని తిప్పి పంపించడంతో, వారు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. దీనిని గుర్తించిన అధికారులు వంద మంది రైతులకు ఒకటే ఆధార్‌ నంబర్‌ ఎలా వచ్చిందనే విషయాన్ని ఆరాతీస్తున్నారు. దీనిపై శాఖాపరమైన విచారణకు అధికారులు ఆదేశించారు. 

  • Loading...

More Telugu News