vijay: మొత్తానికి 'అదిరింది' రిలీజ్ కి ముహూర్తం కుదిరింది!

  • తమిళంలో భారీ వసూళ్లు రాబడుతోన్న 'మెర్సెల్' 
  • తెలుగులో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి  
  • 'అదిరింది' పేరుతో రిలీజ్ కి రెడీ

తమిళంలో విజయ్ తాజా చిత్రంగా వచ్చిన 'మెర్సెల్' వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతోంది. దీపావళి కానుకగా తమిళంలో ఈ సినిమా విడుదలైంది. అదే రోజున 'అదిరింది' పేరుతో ఈ సినిమాను తెలుగులోను విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన సెన్సార్ పనులు పూర్తికాకపోవడం వలన ఆలస్యమైంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ తెచ్చుకుంది. దాంతో ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ మూడు విభిన్నమైన పాత్రలను పోషించగా, కాజల్ .. సమంతా .. నిత్యామీనన్ కథానాయికలుగా నటించారు. తమిళంలో మాదిరిగా తెలుగులోను ఈ సినిమా సందడి చేస్తుందేమో చూడాలి మరి.      

  • Loading...

More Telugu News