singitam srinivas rao: మోక్షజ్ఞ హీరోగా 'ఆదిత్య 369' సీక్వెల్ చేయాలనుకుంటున్నాను!: దర్శకులు సింగీతం శ్రీనివాసరావు

  • అప్పట్లో 'ఆదిత్య 369' ఓ సంచలనం 
  • ఆ మూవీ సీక్వెల్ గురించి సింగీతం 
  • సీక్వెల్ కోసం స్క్రిప్ట్ రెడీ
  • బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం  

దర్శకులు సింగీతం శ్రీనివాసరావు పేరు వినగానే .. ఆయన తెరకెక్కించిన ఆణిముత్యాల వంటి సినిమాలు గుర్తుకువస్తాయి. ప్రయోగాత్మక చిత్రాలను సైతం తెరకెక్కించి విజయాలను అందుకున్న ప్రత్యేకత ఆయన సొంతం. అలాంటి సింగీతం శ్రీనివాసరావు .. గతంలో బాలకృష్ణకి 'ఆదిత్య 369' .. 'భైరవ ద్వీపం' వంటి హిట్స్ ఇచ్చారు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " 'ఆదిత్య 369' సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో వుంది. ఈ సీక్వెల్ కి స్క్రిప్ట్ కూడా రెడీ గా వుంది. అయితే  బాలకృష్ణ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈ సీక్వెల్ లో బాలకృష్ణ తనయుడు 'మోక్షజ్ఞ' హీరో పాత్రను పోషిస్తాడు. బాలకృష్ణ ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తాడు. బాలకృష్ణ ఓకే అంటే ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళుతుంది" అని ఆయన అన్నారు. 'ఆదిత్య 369' కంటెంట్ గురించి .. అప్పట్లో ఆ సినిమా సాధించిన సంచలన విజయం గురించి అభిమానులకు తెలుసు. అందువలన ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే వాళ్లకి అంతకిమించిన ఆనందం ఉండదు.    

  • Loading...

More Telugu News