kishor thirumala: అప్పటికే 'ప్రేమించుకుందాం రా' మూవీని 18 .. 19 సార్లు చూసేశాం : కిషోర్ తిరుమల

  • కిషోర్ తిరుమల తాజా చిత్రంగా 'ఉన్నది ఒకటే జిందగీ' 
  • 8వ క్లాస్ నుంచి విజిల్ బాగా వేసేవాడిని
  •  ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని
  • సినిమా థియేటర్స్ లోను విజిల్ వేసే అలవాటు

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన 'ఉన్నది ఒకటే జిందగీ'లో స్నేహం - ప్రేమ ప్రధానంగా కనిపిస్తాయి. అందువలన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో స్నేహం గురించిన ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా 'ప్రేమించుకుందాం రా' సినిమాను స్నేహితులతో కలసి చూసినప్పుడు థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చారు.

అందుకు కిషోర్ తిరుమల స్పందిస్తూ .. "8వ క్లాస్ నుంచే నేను బాగా విజిల్ వేస్తూ ఉండేవాడిని .. ఇక సినిమాలో పాట వస్తుంటే బీట్ కి తగినట్టుగా విజిల్ వేయడం అలవాటు. స్నేహితులతో కలిసి 'ప్రేమించుకుందాం రా' సినిమాకి వెళ్లినప్పుడు 'పెళ్లి కళ వచ్చేసిందే బాలా .. "పాట వస్తుండగా కూడా అలాగే విజిల్ వేశాను. అప్పుడు పక్క సీట్లోని వ్యక్తి " ఏంటి విజిల్ వేస్తున్నావ్ .." అంటూ సీరియస్ అయ్యాడు. ఆ సమయంలో ఆయన డ్రింక్ చేసి ఉండటంతో, గొడవెందుకులే అని మధ్యలోనే వచ్చేసాం .. అప్పటికే ఆ సినిమాను 18 .. 19 సార్లు చూసేసాం" అంటూ చెప్పుకొచ్చారు.    

More Telugu News