nara lokesh: బహిరంగ లేఖతో నారా లోకేశ్ ను నిలదీసిన పశ్చిమ గోదావరి యువకుడు... సోషల్ మీడియాలో వైరల్!

  • నారా లోకేష్ కు బహిరంగ లేఖ రాసిన ఉదయ్ కిరణ్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బహిరంగ లేఖ
  • నారా లోకేష్ పై ప్రశ్నల వర్షం  

ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ కి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఉదయ్ కిరణ్ అనే యువకుడు రాసిన బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బహిరంగ లేఖలో ఏపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించాడు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని స్పష్టం చేశాడు. గత ఎన్నికల్లో తాము టీడీపీని గెలిపించామని గుర్తుచేశాడు. ఈ లేఖలో పలు సమస్యలు, ప్రభుత్వ విధానాలను నిలదీశాడు. రాష్ట్రాభివృద్ధి అంతా కనికట్టు అని, కాగితాలమీదే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

వైజాగ్ కు ఎన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు వచ్చాయని నిలదీశాడు. త్రిపుర సీఎం జీతమెంత? అప్పుల్లో ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి జీతమెంత? అని నిగ్గదీశాడు. కేరళలో అవినీతి 4 శాతం ఉంటే ఏపీలో 27 శాతం ఎందుకుందని ప్రశ్నించాడు. విషం చిమ్మే ఆక్వా కంపెనీని పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామాల మధ్య ఎందుకు పెట్టారు? లేగ దూడల గిట్టల చప్పుడు వినాల్సిన గోదావరి జిల్లాల ప్రజలు తెల్లారి లేవగానే కరకు పోలీసు బూట్ల చప్పుడు ఎందుకు వింటున్నారని ఆయన ప్రశ్నించాడు. తన బహిరంగ లేఖకి సమాధానం ఇస్తారని భావిస్తున్నానని ఆయన ఆకాంక్షించాడు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిని మీరు కూడా చదవండి.

More Telugu News