venkatesh: తేజతో వెంకీ మూవీ లాంచ్ కి ముహూర్తం ఖరారు

  • తేజ దర్శకత్వంలో వెంకటేశ్ 
  • కథానాయికగా అనుష్క?
  • వచ్చేనెల 16న సినిమా లాంచ్ 
  • అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్

'నేనే రాజు నేనే మంత్రి' సినిమా చూసిన వెంకటేశ్ .. తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఆసక్తిని చూపించారు. దాంతో ఓ కథను సిద్ధం చేసుకుని వెంకటేశ్ కి తేజ వినిపించడం .. అది ఆయనకి నచ్చేయడం జరిగిపోయాయి. సురేశ్ ప్రొడక్షన్స్ తో కలిసి ఈ సినిమాను నిర్మించడానికి ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు సిద్ధమయ్యారు.

ఈ సినిమాను వచ్చేనెల 16వ తేదీన లాంచ్ చేసేందుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా అనుష్కను తీసుకునే ఛాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇక ప్రత్యేక పాత్రలో రానా నటించనున్నట్టు సమాచారం. రానాకు సూపర్ హిట్ ఇచ్చిన తేజ .. వెంకటేశ్ కు కూడా సక్సెస్ ను ఇస్తాడేమో చూడాలి. ఈ సినిమా తరువాత తేజ .. ఎన్టీఆర్ బయోపిక్ మొదలెట్టనున్నాడు.   

More Telugu News