sai dharam tej: 'జవాన్' రిలీజ్ కి దిల్ రాజు గ్రీన్ సిగ్నల్

  • సాయిధరమ్ తేజ్ తాజా చిత్రంగా 'జవాన్' 
  • కథానాయికగా మెహ్రీన్ 
  • రీ షూట్ కారణంగా విడుదలలో జాప్యం 
  • డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు  

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా బీవీఎస్ రవి 'జవాన్' సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా చూసిన దిల్ రాజు కొన్ని సన్నివేశాల విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశాడనీ .. రీ షూట్ జరుగుతోందనే వార్తలు షికారు చేశాయి. ఈ కారణంగానే ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతోందనే టాక్ వినిపించింది. దిల్ రాజు సూచనల మేరకు ఆయన చెప్పిన సన్నివేశాలను బీవీఎస్ రవి సరిచేస్తూ వచ్చాడట.

 మళ్లీ ఒకసారి సినిమా చూసిన దిల్ రాజు .. ఇప్పుడు పెర్ ఫెక్ట్ గా ఉందంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. దాంతో ఈ సినిమాను డిసెంబర్ 1వ విడుదల చేయడానికి రంగం సిద్ధమైందని అంటున్నారు. ఈ సినిమాతో తనకి .. సాయిధరమ్ తేజ్ కి హిట్ ఖాయమనే నమ్మకంతో దర్శకుడు వున్నాడని సమాచారం. హ్యాట్రిక్ హిట్ తరువాత మెహ్రీన్ కథానాయికగా వస్తోన్న ఈ సినిమా, ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

More Telugu News