chiru: 'రంగస్థలం' నుంచి 'సైరా నరసింహా రెడ్డి'లోకి రత్నవేలు!

  • 'సైరా' సినిమా కోసం జరుగుతోన్న సన్నాహాలు
  • దర్శకుడిగా సురేందర్ రెడ్డి 
  • డిసెంబర్లో సెట్స్ పైకి 
  • సినిమాటోగ్రాఫర్ స్థానంలో మార్పు  

చిరంజీవి 151వ సినిమాగా 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను జాతీయ స్థాయిలో విడుదల చేయాలనుకుంటున్నారు. అందువలన స్టార్ టెక్నీషియన్స్ ను తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమాటోగ్రాఫర్ గా మొదట్లో రవివర్మన్ ను తీసుకున్నారు.

 అయితే శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు' సినిమా సీక్వెల్ కి సన్నాహాలు మొదలు కావడంతో, ఆ ప్రాజెక్టు నుంచి పిలుపు రావడంతో రవివర్మన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. ఈ సినిమా డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. అందువలన ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా, సినిమాటోగ్రాఫర్ రత్నవేలును తీసుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం రత్నవేలు 'రంగస్థలం' సినిమాను చేస్తున్నాడు. అది పూర్తికాగానే ఆయన 'సైరా' ప్రాజెక్టులోకి రానున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం వుంది. 

More Telugu News