రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా వైసీపీ నేత, ఆయన తల్లి
- బెంగళూరుకు వెళుతుండగా యాక్సిడెంట్
- తవణంపల్లి మండలం మారేడుపల్లి వద్ద ప్రమాదం
- నలుగురు కుటుంబసభ్యుల పరిస్థితి విషమం
ఈ ఘటనలో విద్యాసాగర్ రెడ్డి, ఆయన తల్లి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మిగిలిన నలుగురు కుటుంబసభ్యుల పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని రాయవేలూరు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.