ysrcp: రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా వైసీపీ నేత, ఆయన తల్లి

  • బెంగళూరుకు వెళుతుండగా యాక్సిడెంట్
  • తవణంపల్లి మండలం మారేడుపల్లి వద్ద ప్రమాదం
  • నలుగురు కుటుంబసభ్యుల పరిస్థితి విషమం

ఘోర రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లా వైసీపీ నేత విద్యాసాగర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే కాణిపాకంకు చెందిన విద్యాసాగర్ రెడ్డి ఆయన తల్లి ధనమ్మ, భార్య, ఇద్దరు కుమారులు, కోడలుతో కలసి బెంగళూరుకు ఈ ఉదయం బయల్దేరారు. రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత తవణంపల్లి మండలం మారేడుపల్లి వద్ద వారి కారు అదుపుతప్పి, కల్వర్టును ఢీకొంది.

ఈ ఘటనలో విద్యాసాగర్ రెడ్డి, ఆయన తల్లి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మిగిలిన నలుగురు కుటుంబసభ్యుల పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని రాయవేలూరు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News