raj taraun: ముగింపు దశలో 'రాజుగాడు' .. సాహసంతో సంక్రాంతి బరిలోకి!

  • షూటింగ్ ముగింపు దశలో 'రాజుగాడు'
  • రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ 
  • కథానాయికగా అమైరా దస్తూర్    

యూత్ కి కనెక్ట్ అయ్యే కథలను ఎంచుకుంటూ రాజ్ తరుణ్ దూసుకుపోతున్నాడు. తెరపై అల్లరి చేసే యంగ్ హీరోల్లో రాజ్ తరుణ్ ముందు వరుసలో కనిపిస్తాడు. ఆ తరహా పాత్రతోనే ఆయన తాజా చిత్రం 'రాజుగాడు' తెరకెక్కుతోంది. సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, రెండు పాటల మినహా షూటింగును పూర్తి చేసుకుంది.

 ఈ రెండు పాటలను కూడా త్వరలోనే చిత్రీకరించనున్నారు. అమైరా దస్తూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. సాధారణంగా సంక్రాంతికి పెద్ద సినిమాలు రంగంలోకి దిగుతుంటాయి .. తమ బలాబలాలు తేల్చుకుంటూ ఉంటాయి. అలాంటిది ఆ సమయంలో వస్తానని చెబుతుండటం 'రాజుగాడు' చేస్తోన్న సాహసమేనని చెప్పుకుంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే రాజ్ తరుణ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి మరి.      

More Telugu News