mariat hotel: సికింద్రాబాదు మారియట్ హోటల్ లో 17 రూముల్లో ప్రముఖుల పేకాట... టాస్క్ ఫోర్స్ దాడులు!

  • మూడు రోజులుగా పేకాడుతున్న ప్రముఖులు
  • విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ దాడులు
  • 40 మంది పారిశ్రామిక, వ్యాపార, ప్రముఖులు ఉన్నట్టు సమాచారం

సికింద్రాబాదులోని మారియట్ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారంతో ఈ ఉదయం దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడి తంతు చూసి ఆశ్చర్యపోయారు. సుమారు 17 రూముల్లో పెద్దఎత్తున పేకాడుతున్న 40 మంది ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, పేరొందిన ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది.

ఆయా గదుల్లోంచి పెద్దఎత్తున కరెన్సీ, విదేశీ కరెన్సీ, విదేశీ మద్యం, హుక్కాలు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా గత మూడు రోజులుగా ఈ హోటల్ లో మకాం వేసి పేకాడుతున్నట్టు తెలుస్తోంది. పేకాడేందుకు వీరందర్నీ ఏకతాటిపై చేర్చింది, హోటల్ లో పేకాట కోసం వారం రోజులపాటు 17 రూమ్ లను బుక్ చేసింది సంజయ్, ప్రవీణ్ అనే వ్యక్తులని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ పరారీలో ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు. 

More Telugu News