tamilnadu: తమిళనాడులో కుప్పకూలిన బస్సు డిపో గ్యారేజ్.. ఎనిమిది మంది మృతి!

  • నాగపట్టణం జిల్లా పొరయూర్ లో ప్రమాదం
  • కుప్పకూలిన బస్ డిపో గ్యారేజ్
  • 8 మంది మృతి, 20 మందికి తీవ్రగాయాలు

తమిళనాడులో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని నాగపట్టణం జిల్లా పొరయూర్ లోని ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన బస్ డిపో గ్యారేజ్ కుప్పకూలింది. అకస్మాత్తుగా గ్యారేజ్ కూలిపోవడంతో అందులో విధులు నిర్వర్తిస్తున్న 8 మంది ఉద్యోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

More Telugu News