ములాయం కుటుంబాన్ని ఒక్కటి చేసిన దీపావళి!
- అఖిలేష్తో కలిసి పండుగ చేసుకున్న ములాయం, శివ్పాల్
- విభేదాలు తొలగిపోయి ఒక్కటయ్యామన్న ములాయం
- 2019 ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటన
తొలుత ములాయం సైఫైలోని కుమారుడి ఇంటికి చేరుకుని నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత కాసేపటికే శివ్పాల్ అక్కడికి చేరుకున్నారు. బాబాయ్ శివ్పాల్ను ఆహ్వానించిన అఖిలేశ్ ఆయన పాదాలకు నమస్కరించారు. శివ్పాల్ ఆయనను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఇతర నేతలతో కలిసి 2019 ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ‘మిషన్-2019’ను తెరపైకి తెచ్చారు.
దీపావళితో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయాయని ములాయం పేర్కొన్నారు. పార్టీ, కుటుంబం ఒక్కటయ్యాయన్నారు. అందరం కలిసి దీపావళిని జరుపుకున్నట్టు చెప్పారు. అందరం కలిసి పార్టీని మరింత ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తామని ఈ సందర్భంగా ములాయం వివరించారు.