మెహబూబా ముఫ్తీ: పిల్లలతో కలిసి దీపావళి జరుపుకున్న జమ్ముకశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ

  • జమ్ముకశ్మీర్ లోని ఆర్‌ఎస్‌ పురా సెక్టార్‌లో ఉన్న అనాథాశ్రమానికి వెళ్లిన ముఫ్తీ
  • చిన్నారులకు స్వీట్లు పంచిన సీఎం
  • పిల్లలు పాడిన పాటలను విన్న ముఫ్తీ

భారత్-పాకిస్థాన్‌ సరిహద్దులోని గురేజ్ వ్యాలీ (జ‌మ్ముక‌శ్మీర్‌) లో ఈ రోజు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సైనికుల‌తో క‌లిసి దీపావ‌ళి జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు, జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా బార్డ‌ర్‌లోనే దీపావ‌ళి వేడుక‌లు జ‌రుపుకున్నారు. ఆర్‌ఎస్‌ పురా సెక్టార్‌లో ఉన్న అనాథాశ్రమానికి వెళ్లిన ముఫ్తీ అక్క‌డి పిల్లలతో ముచ్చ‌టించి స్వీట్లు పంచి, దివాలి పండుగ చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా చిన్నారులు ఆమెకు పాట‌లు పాడి వినిపించారు. మెహబూబా ముఫ్తీ గ‌త ఏడాది కూడా పిల్ల‌ల‌తోనే దీపావళి జ‌రుపుకున్నారు.
   

More Telugu News