ys jagan: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన వ్యాపారవేత్త శివారెడ్డి

  • అనంతపురం జిల్లా నేత శివారెడ్డి
  • నాపై జగన్ ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానన్న శివారెడ్డి
  • వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమన్న వైసీపీ నేత

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన వ్యాపారవేత్త వైవీ శివారెడ్డి వైసీపీలో చేరారు. జగన్ ధర్మవరం పర్యటన సందర్భంగా ఆయన తన అనుచరులతో కలసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను జగన్ బస్సుపైకి పిలిపించి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీని బలోపేతం చేయడానికి ఆయన తన వంతు కృషి చేయాలని కోరారు.

ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ, జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానని చెప్పారు. పార్టీ అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలోని పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో కలసి పని చేస్తానని అన్నారు. 

More Telugu News