telangana: కొల్లూరు సమీపంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు... ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య?

  • స్థానికుల సమాచారంతో ముగ్గురు యువతుల మృతదేహాలు గుర్తించిన పోలీసులు
  •  కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తుండగా మరో రెండు మృతదేహాల గుర్తింపు
  • వారంతా ఒకే కుటుబానికి చెందిన వారిగా గుర్తింపు

హైదరాబాదులోని నార్సింగి దగ్గర్లోని కొల్లూరులో విషాదం చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... కొల్లూరు గ్రామం సమీపంలో ముగ్గురు యువతుల మృతదేహాలను స్థానికులు ఈ ఉదయం గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. ఆ సమీపంలోనే ఒక కారులో ఓ పురుషుడు, పిల్లాడి మృతదేహాలు కనిపించాయి. వారంతా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ కి చెందిన ఒకే కుటుంబ సభ్యులని గుర్తించారు. వారంతా ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

More Telugu News