sharwanand: శర్వానంద్ ద్విపాత్రాభినయం .. హీరోయిన్ గా షాలినీ పాండే!

  • సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ 
  • తొలిసారిగా శర్వా ద్విపాత్రాభినయం 
  • ఒక కథానాయికగా నివేదా థామస్ 
  • త్వరలోనే సెట్స్ పైకి        

'మహానుభావుడు'తో మరో హిట్ ను సొంతం చేసుకున్న శర్వానంద్, సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో శర్వానంద్ మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేయనున్నాడు.

ఇప్పటికే ఒక కథానాయికగా నివేదా థామస్ ను ఎంపిక చేసుకున్నారు. ఇక రెండవ హీరోయిన్ గా షాలినీ పాండేను తీసుకున్నారనేది తాజా సమాచారం. 'అర్జున్ రెడ్డి' సినిమాతో షాలినీ పాండే ఎంత పాప్యులర్ అయిందో తెలిసిందే. ప్రస్తుతం ఆమె తెలుగులో 'మహానటి' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. అంతేకాకుండా '100% లవ్' తమిళ రీమేక్ లోను చేస్తోంది. శర్వానంద్ వంటి హీరోతో చేసే ఛాన్స్ ను ఇంత ఫాస్టుగా కొట్టేసిందంటే, అమ్మడి స్పీడ్ ఒక రేంజ్ లోనే ఉందని చెప్పుకుంటున్నారు.         

  • Loading...

More Telugu News