Team India: నేడే హై వోల్టేజ్ మ్యాచ్.. చిరకాల ప్రత్యర్థి పాక్‌తో భారత్ హాకీ జట్టు ఢీ!

  • వరుస విజయాలతో ఇప్పటికే సూపర్-4కు చేరుకున్న భారత్
  • లీగ్‌లో చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించాలని ఆశ
  • పూల్-ఎలో 6 పాయింట్లతో అగ్రస్థానం

దాయాదుల  పోరుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్ హాకీలో వరుసగా రెండు విజయాలు సాధించి జోరు మీదున్న టీమిండియా నేడు పాక్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్‌లో జపాన్‌ను 5-1తో ఓడించిన భారత్, రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 7-0తో చిత్తు చేసింది. పూల్-ఎలో భారత్ మొత్తం ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా పాక్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటికే సూపర్-4కు చేరుకున్న మన్‌ప్రీత్ సేన పాక్‌పైనా విజయ దుందుభి మోగించి లీగ్ చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించాలని ఉవ్విళ్లూరుతోంది. భారత్-పాక్‌లు చివరిసారిగా జూన్‌లో లండన్‌లో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్స్‌లో తలపడ్డాయి.

  • Loading...

More Telugu News