nandan nilekani: ఆధార్ గురించి భయం అక్కర్లేదు: నీలేకని

  • వ్యక్తిగత వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది
  • గోప్యతను పాటించడంలో భారత్ అత్యుత్తమంగా ఉంది
  • ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు

ఆధార్ నెంబరు, వ్యక్తిగత వివరాల గోప్యత గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆధార్ రూపకర్త నందన్ నీలేకని చెప్పారు. ఈ వివరాలను ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచుతుందని అన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వివరాలను తెలిపారు. ఆధార్ వివరాలు బహిర్గతమవుతున్నాయని... ఇది వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమే అవుతుందని కొందరు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, గోప్యతను పాటించడంలో భారత్ అత్యుత్తమంగా ఉందని అన్నారు.

More Telugu News