భట్టి విక్రమార్క: మరి, బహుమతుల రూపంలో లంచం ఇచ్చేవారిని ఏం చేయాలి?: కేసీఆర్ కు భట్టి విక్రమార్క సూటి ప్రశ్న

  • సీఎం కేసీఆర్ ని ప్రశ్నించిన కాంగ్రెస్ నేత
  • మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రులకు, కార్యదర్శులకు వస్త్రాలు పంపడం కూడా లంచం కిందకే వస్తుంది
  • రాష్ట్ర ఖజానా నుంచి బహుమతులు ఎలా ఇస్తారు?: భట్టి

‘లంచం ఇచ్చినా, తీసుకున్నా చెప్పుతో కొట్టండి’ అని సీఎం కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారని, మరి, బహుమతుల రూపంలో లంచాలు ఇచ్చేవారిని ఏం చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పాత్రికేయులతో ఈరోజు పిచ్చాపాటీగా ఆయన మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్  కేంద్రమంత్రులు, కార్యదర్శులకు వస్త్రాలు పంపడం కూడా లంచం కిందికే వస్తుందని, రాష్ట్ర ఖజానా నుంచి బహుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

నిన్న సూర్యాపేట సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క స్పందిస్తూ, నాగార్జునసాగర్ నిర్మించిన స్థలం తప్పయితే, సరైన స్థలంలో మరో ప్రాజెక్ట్ ను కేసీఆర్ నిర్మించవచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాము ప్రారంభించిన ప్రాజెక్ట్ లకు పేర్లు మార్చడం తప్పా కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కంటే తమ పార్టీ ముందుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 

More Telugu News