sandeep reddy vanga: 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ తో పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్?

  • 'అర్జున్ రెడ్డి' సినిమా ఓ సంచలనం 
  • దర్శకుడు సందీప్ రెడ్డికి పెరుగుతోన్న డిమాండ్
  • ఆయనతో చేయడానికి ఆసక్తిగా వున్న నిర్మాతలు 
  • ఉత్సాహాన్ని చూపుతోన్న హీరోలు  

'అర్జున్ రెడ్డి' సినిమా తెలుగులో భారీ విజయాన్ని సాధించడమే కాదు, ఓవర్సీస్ లోను తన హవాను కొనసాగించింది. ఇక ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ఇతర భాషలకి చెందిన దర్శక నిర్మాతలు పోటీపడ్డారు. అలాంటి సినిమాను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగాకు సహజంగానే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మైత్రీ మూవీస్ వారు తమ బ్యానర్లో ఒక సినిమా చేసి పెట్టమంటూ, ఇప్పటికే సందీప్ రెడ్డికి 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక పవన్ కల్యాణ్ తోను ఈ దర్శకుడు ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందనేది ఫిల్మ్ నగర్ టాక్. 'అర్జున్ రెడ్డి' హిట్ టాక్ వచ్చినప్పుడే పవన్ నుంచి సందీప్ కి ఫోన్ కాల్ వెళ్లిందట. మంచి కథ రెడీ చేయమని పవన్ చెప్పాడని అంటున్నారు. ఆ తరువాత పవన్ ను కలిసిన సందీప్ ఒక లైన్ వినిపించగా ఆయన ఆసక్తిని చూపించాడని చెబుతున్నారు. ఆ లైన్ ను డెవలప్ చేసుకుని రమ్మని చెప్పాడని అంటున్నారు. పూర్తి కథతో పవన్ ని సందీప్ మెప్పిస్తే .. ఈ కాంబినేషన్ సెట్ కావడం ఖాయమని చెప్పుకుంటున్నారు.    

More Telugu News