sai pallvi: తెలుగు సినిమాలపై ఆసక్తిని చూపని సాయిపల్లవి?

  • 'ఫిదా'తో హిట్ కొట్టిన సాయిపల్లవి
  • తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్
  • ప్రస్తుతం తెలుగులో చేస్తున్నది ఒక్క సినిమానే
  • తమిళ చిత్రాలకే ప్రాధాన్యత       

తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పుడు సాయిపల్లవికి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. 'ఫిదా' సినిమాలో పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా సాధించిన భారీ విజయం ఆమెకి మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టడం ఖాయమని అంతా అనుకున్నారు. అలాగే ఆమెను చాలామంది దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నారు కూడా.

 అయితే ఆమె తెలుగు సినిమాలు చేసే ఉద్దేశంతో లేదనేది టాక్. తనకి పారితోషికం ముఖ్యం కాదని మొదట్లోనే చెప్పేసిన సాయిపల్లవి, ప్రస్తుతం నాని జోడీగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' చేస్తోంది. ఇది కూడా 'ఫిదా' రిలీజ్ కి ముందుగా ఒప్పుకున్నదే. ఇప్పుడు మాత్రం ఆమె తెలుగులో ఏ ప్రాజెక్టును అంగీకరించలేదు. తమిళంలో మాత్రం 'కరు' .. 'మారి 2' సినిమాలను ఒప్పుకుంది. దాంతో తమిళ .. మలయాళ సినిమాలు చేసి .. అవి తెలుగులో విడుదలయ్యేలా చూసుకోనుందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతో చూడాలి మరి.        

  • Loading...

More Telugu News