sai dharam tej: 'జవాన్' రిలీజ్ మరింత ఆలస్యం కానుందా?

  • సాయిధరమ్ తేజ్ హీరోగా 'జవాన్'
  • ఈ సినిమాపైనే తేజు ఆశలు
  • కథానాయికగా మెహ్రీన్

సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస పరాజయాలతో వున్నాడు. సరైన హిట్ పడాలనే పట్టుదలతో వున్నాడు. ఆ హిట్ 'జవాన్' మూవీ తీసుకొస్తుందనే ఆశతో వున్నాడు. ఆ సినిమా రిలీజ్ ఆలస్యమవుతుండటమే ఆయనకి నిరాశను కలిగిస్తోంది. బీవీఎస్ రవి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావలసింది. అయితే కొన్ని సీన్స్ విషయంలో అసంతృప్తిగా వున్న దిల్ రాజు రీ షూట్ చేయమని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి.

 ఆ తరువాత దసరాకి పోటీ ఎక్కువగా ఉండటం వలన రిలీజ్ చేయలేదు. నవంబర్ 3న విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ రోజున కూడా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదనేది తాజా సమాచారం. డిసెంబర్ 1వ తేదీకి ఈ సినిమాను వాయిదా వేసినట్టుగా చెప్పుకుంటున్నారు. తేజు ఫ్యాన్స్ కి ఇది నిరాశను కలిగించే విషయమే. ఈ సినిమాలో కథానాయిక మెహ్రీన్ అనే సంగతి తెలిసిందే      

More Telugu News