asteroid: నేడు అత్యంత సమీపం నుంచి దూసుకెళ్లనున్న గ్రహశకలం.. భూమికి ముప్పేమీ లేదు!

షార్ట్స్‌లో చూడండి
భూమికి పెను ప్రమాదం తప్పింది. భూమిని ఢీకొనే అవకాశం ఉన్న గ్రహశకలం తన దిశను మార్చుకుని... భూమికి అత్యంత సమీపంలో నుంచి వెళ్లనుంది. ఈ మధ్యాహ్నం ఇది అంటార్కిటికా సమీపం నుంచి భూమిని దాటుకుంటూ వెళుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహశకలం పేరు 2012 టీసీ4. దీని వ్యాసార్ధం 15-30 మీటర్లు. ఇది ప్రయాణిస్తున్న దిశను బట్టి 2017లో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని హవాయి దీవుల్లోని పనోరమిక్ సర్వే టెలిస్కోప్ ర్యాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్ 2012లో అంచనా వేసింది. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు గ్రహశకల గమనాన్ని అనుక్షణం పరిశీలిస్తున్నారు. ఇది క్రమంగా తన దిశను మార్చుకుందని, భూమికి 42 వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించనుందని వారు ప్రకటించారు.
Go Back to Shorts
asteroid
2012 ts4

More Telugu News