seerath kapoor: 'టచ్ చేసి చూడు' లైన్లోనే ఉందన్న మాట!

  • రిలీజ్ కి రెడీగా 'రాజా ది గ్రేట్'
  • వార్తల్లో కనిపించని 'టచ్ చేసి చూడు'
  • ఈ ప్రాజెక్టు ఆగిపోలేదు
  • ఈ సినిమాలో ఒక కథానాయికగా శీరత్ కపూర్  

ఈ ఏడాది రవితేజ రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకు వచ్చాడు. ఈ రెండింటిలో 'రాజా ది గ్రేట్' సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అంధుడిగా రవితేజ నటించిన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది.

అయితే విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో మొదలైన 'టచ్ చేసి చూడు' సినిమా షూటింగ్ మాత్రం ఆగిపోయిందనే వార్తలు షికారు చేశాయి. ఆ సినిమా కథ విషయంలో రవితేజ అసంతృప్తిగా ఉన్నాడనే టాక్ వినిపించింది. ఇక ఈ ప్రాజెక్టు అటకెక్కినట్టేనని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా సెట్స్ పైనే వున్నట్టుగా శీరత్ కపూర్ మాటల వలన తెలుస్తోంది. ఈ సినిమాలో తన పాత్రకి ఎంతో ప్రాముఖ్యత ఉందనీ, తనకి మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందని ఆమె చెప్పింది. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఎప్పటి నుంచి మొదలవుతుందో చూడాలి మరి.  

  • Loading...

More Telugu News