renigunta airport: రేణిగుంట విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం

  • ప్రయాణికుడి వద్ద 17 రౌండ్ల బుల్లెట్లు
  • స్వాధీనం చేసుకున్న సెక్యూరిటీ సిబ్బంది
  • పోలీసులకు అప్పగింత

చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం రేగింది. రామ్మోహన్ రెడ్డి అనే ప్రయాణికుడి వద్ద నుంచి 17 రౌండ్ల 9ఎంఎం బుల్లెట్లను గుర్తించిన ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది... వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మోహన్ రెడ్డిని సీఐఎస్ఎఫ్ అధికారులు ప్రశ్నించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితుడు రామ్మోహన్ రెడ్డి తిరుపతి నుంచి హైదరాబాదుకు ట్రూజెట్ విమానంలో వస్తుండగా... అతని వద్ద తూటాలను గుర్తించారు. 

More Telugu News