vijay: ట్రైల‌ర్ లేకుండానే విడుద‌ల కానున్న విజ‌య్ `మెర్స‌ల్‌`

  • వెల్ల‌డించిన ద‌ర్శకుడు అట్లీ
  • ఇప్ప‌టికే విడుద‌లైన రెండు ప్రోమోలు, ఒక టీజ‌ర్‌
  • దీపావ‌ళికి విడుద‌లకానున్న చిత్రం

ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ త్రిపాత్రాభిన‌యం చేసిన `మెర్స‌ల్` (తెలుగులో 'అదిరింది') చిత్రం ట్రైల‌ర్ లేకుండానే విడుద‌లకానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు అట్లీ మీడియాతో మాట్లాడుతూ స్ప‌ష్టం చేశారు. ఈ సినిమాను దీపావ‌ళికి విడుద‌ల చేయాల్సి ఉండటంతో స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్నందున ట్రైల‌ర్ లేకుండానే సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు అట్లీ పేర్కొన్నారు.

ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి విడుద‌లైన టీజ‌ర్‌, ప్రోమోల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 3292 థియేటర్ల‌లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. థియేట‌ర్ల విష‌యంలో బాహుబ‌లి, స్పైడ‌ర్ సినిమాల‌ రికార్డును `మెర్స‌ల్` బ్రేక్ చేసింది.

ఇక ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, స‌మంత‌, నిత్యామీన‌న్‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. మ‌రోప‌క్క త‌మిళ‌నాట వివాదాస్ప‌దంగా మారిన ద్వంద్వ‌ ప‌న్నుల అంశం సినిమా విడుద‌ల మీద ప్ర‌భావం చూపించే అవ‌కాశముంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

More Telugu News