panner selvam: పన్నీర్ సెల్వంను అడ్డుకున్న ప్రజలు!

  • తాగునీరు రావడం లేదంటూ ఆందోళన
  • నెల రోజులు గడచినా చర్యలు తీసుకోలేదంటూ మండిపాటు
  • సమస్యను పరిష్కరించాలంటూ పన్నీర్ సెల్వం ఆదేశాలు 

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ప్రజల నిరసన సెగ తగిలింది. తేని ప్రాంతం అల్లినగరం పంచాయతీ పరిధిలో తాగునీటి పథకాలను పరిశీలించేందుకు పన్నీర్ సెల్వం వెళ్లారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం వాహనశ్రేణిని అడ్డుకున్న స్థానికులు... ఆయన కారును చుట్టుముట్టారు. తమ ప్రాంతంలో తాగునీటి సమస్య తలెత్తిందని... నెల రోజులు గడచినా, ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు మండిపడ్డారు. ఈ క్రమంలో కారు దిగిన పన్నీర్ సెల్వం ఆందోళనకారులను శాంతింపజేశారు. తాగునీటి పంపిణీకి తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో, ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

More Telugu News