ఏపీ: ఏపీలో ఇకపై ‘చంద్రన్న పెళ్లి కానుక’.. బీసీలకు రూ. 30 వేల నజరానా

  • బీసీ సామాజిక వర్గానికి చెందిన పేద వధూవరుల కోసం ‘చంద్రన్న పెళ్లి కానుక’
  • ఈ పథకం కింద రూ.30 వేలు
  • వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలు చేసే యోచనలో ప్రభుత్వం

ఏపీలో ఇకపై ‘చంద్రన్న పెళ్లి కానుక’ అందుబాటులోకి రానుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన పేద వధూవరులను దృష్టిలో పెట్టుకుని రూ.30 వేలు ఈ పథకం కింద అందించనుంది. ఈ అంశంపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ఆధ్వర్యంలో చర్చ నిర్వహించారు. ఈ నిర్ణయానికి మంత్రి వర్గం ఆమోదం లభించినట్టు సమాచారం. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ‘చంద్రన్న పెళ్లి కానుక’ను అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశంలో మూడో విడత రైతు రుణమాఫీ, ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రంలో ప్రబలుతున్న విషజ్వరాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్టు సమాచారం.

More Telugu News