ఎంఎంటీసీ: ఎంఎంటీఎస్‌ రైలులో పాము.. ప్రయాణికులలో కలకలం!

  • లింగంపల్లి నుంచి ఫలక్ నుమా వెళుతున్న రైలులో సంఘటన
  • అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ సిబ్బంది
  • పామును వెళ్లగొట్టేందుకు సిబ్బంది విఫలయత్నం

హైదరాబాదు, ఎంఎంటీఎస్ రైలులో పాము కనిపించడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. లింగంపల్లి నుంచి ఫలక్ నుమా వెళుతున్న రైలులోని ఓ బోగీలో పాము ఉండటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఈ రైలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకున్న తర్వాత, పామును వెళ్లగొట్టేందుకు అరగంట పాటు ఆర్పీఎఫ్ సిబ్బంది విఫలయత్నం చేశారు. అప్పటికే, ఆలస్యం కావడంతో రైలును ఫలక్ నుమాకు పంపించారు. పాము ఉన్న బోగీలోని ప్రయాణికులను వేరే బోగీలోకి ఎక్కించినట్టు ప్రత్యక్షసాక్షుల కథనం.

More Telugu News