ohmkar: నాగ్, సమంతలను ఒప్పించడంతోనే పూర్తి సక్సెస్ ను సాధించాను : ఓంకార్

  • ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజుగారి గది 2'
  • రెండవ సినిమానే స్టార్స్ తో చేయడం పట్ల ఆనందం
  • నాగ్, సమంత రాకతో సినిమా స్థాయి పెరిగింది
  • ఈ నెల 13న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు  

ఓంకార్ దర్శకత్వం వహించిన 'రాజుగారి గది 2' సినిమా ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం నాగ్ అభిమానులు .. సమంత ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐ డ్రీమ్స్ వారితో ఓంకార్ మాట్లాడుతూ, దర్శకుడిగా ఈ సినిమా తనకి ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. తన రెండవ సినిమానే పెద్ద బ్యానర్లో .. పెద్ద ఆర్టిస్టులతో చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

చిన్న సినిమాగానే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకువెళదామని అనుకున్నాననీ, అయితే పీవీపీ వారు .. మ్యాట్నీ సంస్థ వారు నిర్మాతలుగా ముందుకు రావడంతో ఈ సినిమా స్థాయి పెరిగిందని అన్నారు. ఇక ఈ కథను వినిపించిన 5 నిమిషాల్లోనే ఈ సినిమా చేస్తున్నట్టు నాగ్ చెప్పడంతో, తాను సగం సక్సెస్ ను సాధించినట్టు భావించానని చెప్పారు. ఇక సమంత కూడా "కథ సూపర్బ్" అంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు విషయంలో పూర్తి సక్సెస్ ను సాధించినట్టుగా భావించానని అన్నారు. నాగ్ .. సమంత ఎంట్రీ కారణంగా ఇది పెద్ద ప్రాజెక్టుగా మారిపోయిందనీ .. అందరిలోను అంచనాలను పెంచేసిందని చెప్పుకొచ్చారు.    

More Telugu News