sachin polot: అప్పటిదాకా తలపాగా ధరించను: సచిన్ పైలట్

  • రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తర్వాతే తలపాగా ధరిస్తా
  • విజయాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థించా
  • ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలవలేకపోవడం బాధించింది

రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్ శపథం చేశారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు తాను తలపాగా ధరించనని ప్రతినబూనారు. 2018లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కిసాన్ న్యాయ పాదయాత్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ శపథం చేశారు.

2014 ఎన్నికల్లో ఒక్క లోక్ సభ స్థానంలో కూడా కాంగ్రెస్ గెలవకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకే ఈ శపథం అని చెప్పారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని దేవుడిని ప్రార్థించానని... విజయం సాధించిన తర్వాతే తాను రాజస్థానీ తలపాగాను ధరిస్తానని తెలిపారు. 

More Telugu News